telugu navyamedia
సినిమా వార్తలు

పైడిపల్లి మాలిని పుట్టినరోజు… సందడి చేసిన మహేష్, ఎన్టీఆర్

Mahesh-and-NTR

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “మహర్షి” సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రొమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా వంశీ సతీమణి మాలిని పుట్టినరోజు సందర్భంగా పార్టీని ఏర్పాటు చేశారు వంశీ పైడిపల్లి. ఈ పార్టీలో ఇద్దరు స్టార్ హీరోలు తమ కుటుంబాలతో కలిసి సందడి చేశారు. మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి ఈ పార్టీకి హాజరు కాగా, ఎన్టీఆర్ కూడా తన భార్య లక్ష్మీ ప్రణతితో హాజరై మాలినికి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు స్టార్ హీరోల రాకతో ఈ పార్టీ అద్భుతంగా జరిగింది. మాలిని పుట్టినరోజు సందర్భంగా వీరంతా కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో “బృందావనం” సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

Related posts