రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా గుడ్విల్ అంబాసిడర్గా ప్రముఖ సినీ నటి మాధురీ దీక్షిత్ నియమితులయ్యారు. ఓటు ప్రాధాన్యత, ఓటింగ్ ఆవశ్యకత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర ఎన్నికల సంఘం మాధురీదీక్షిత్ ను అంబాసిడర్గా నియమించింది.
ప్రజాస్వామ్య పద్దతిలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఓటర్ల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ..లెట్స్ ఓట్ పేరుతో రూపొందించనున్న వీడియోలో మాధురీ దీక్షిత్ కనిపించనున్నారు. అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు వెల్లడికానున్నాయి.