telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దం

counting election

తెలంగాణ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశామని తెలిపారు. ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నిక ఉంటుందని ఎస్‌ఈసీ చెప్పారు. ఈ నెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక ఉంటుందన్నారు. 25వ తేదీ సాయంత్రానికి నగరపాలక, మున్సిపల్‌ ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు.

రాజకీయ పార్టీలు మేయర్‌, ఛైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలని సూచించారు. ఈ నెల 26న ఉదయం 11 గంటల వరకు ఏ ఫామ్‌, 27న ఉదయం 10 గంటల వరకు బీ ఫామ్‌ ఇవ్వాలన్నారు. రాజకీయ పార్టీలు తమ విప్‌లను నియమించుకోవచ్చు అని నాగిరెడ్డి సూచించారు. విప్‌ ఎవరన్నది ఆయా పార్టీలు 26న ఉదయం 11 గంటల వరకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

Related posts