దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్తో “ఆర్ఆర్ఆర్” అనే మల్టీస్టారర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కొమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఒక్క ఇంటర్వెల్ సీన్ కోసమే 40 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరిస్తున్న ఈ సన్నివేశం షూటింగ్లో వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారట. ప్రస్తుతం ఎన్టీయార్ ఈ సీన్ షూటింగ్లో పాల్గొంటున్నాడట. మరో రెండ్రోజుల్లో చెర్రీ కూడా జాయిన్ అవుతాడట. దాదాపు నెల రోజులు ఈ సీన్ కోసమే ప్రత్యేకంగా కేటాయించినట్టు తెలుస్తోంది.
previous post