సినీ దిగ్గజం, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిశారు.
కొంతకాలంగా మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (సీవోపీడీ)తోపాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏడాది కిందట మధుమేహం కారణంగా ఆయన పాదం కూడా తొలగించారు. ఇటీవల కొవిడ్ సోకడంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కోలుకొని ఇంటికి చేరుకున్నా.. పోస్టు కొవిడ్ సమస్యలు తలెత్తాయి. ఆగస్టు 5న తీవ్ర ఆయాసంతో మళ్లీ ఏఐజీలో చేరారు. గత 27 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో తీవ్ర న్యుమోనియా కూడా రావడంతో శనివారం రాత్రి నుంచి ఆరోగ్యం మరింత విషమించింది. మూత్రపిండాల పనితీరు పూర్తిగా దిగజారింది. చివరికి కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. వైద్యులు సీపీఆర్ ప్రక్రియతో కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
ఆయన పార్ధీవ దేహాన్నిజూబ్లీహీల్స్లోని ఇంటిలోనే ఉంచారు . కృష్ణంరాజు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు చలనచిత్ర ప్రముఖులు హాజరైన నివాళులర్పించారు.
పండితుల సూచన మేరకు ఆయన కృష్ణంరాజు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మొయినాబాద్లోని కనకమామిడి ఫామ్ హౌస్లో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు జగనున్నాయి.
ఇంటినుండి మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర రంగారెడ్డి జిల్లాలోని సొంత ఫాం హౌస్ వరకూ కొనసాగనుంది తమ అభిమాన నటుడు కృష్ణం రాజు చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలిస్తున్నారు