*ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
*కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లులపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావు మృతికి సంతాపంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. 2 నిమిషాలపాటు సభ సంతాపం తెలిపింది.
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతోపాటు మున్సిపల్శాఖ చట్ట సవరణ, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లులను మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి హరీశ్రావు, అటవీ యూనివర్సిటీ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మోటర్ వెహికిల్స్ టాక్సేషన్ సవరణ బిల్లులును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రవేశపెట్టారు. విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించారు..
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు – పర్యవసానాలపై లఘు చర్చను ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభించారు. ఇదే అంశంపై మండలిలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి లఘు చర్చను ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎర్రబెల్లి