ఈ మధ్య అధికారులు పంపిస్తున్న పవర్ బిల్లులు.. సామాన్యులకే కాదు సెలబ్రిటీలు కూడా షాక్ ఇస్తున్నాయి. తాజాగా హీరోయిన్కు పవర్ బిల్లు చూసి షాక్ తగిలింది. తెలుగు, తమిళంలో సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరొందిన నటి కార్తీక నాయర్. తాజాగా తన ముంబై ఇంటి కరెంట్ బిల్లుని షేర్ చేస్తూ.. బిల్లు చూసి షాక్ అయ్యానని కామెంట్ పెట్టింది కార్తీక. ముంబయిలోని కార్తీక ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. లాక్డౌన్ వలన గత రెండు నెలలుగా బిల్లు తీయకుండా ఇటీవల డైరెక్ట్ గా బిల్లు పంపించారు. ఆ బిల్లులో లక్ష రూపాయలు ఉండటం చూసి షాక్ అయ్యానని తెలిపింది కార్తీక. ఇది నా హోటల్ బిల్లు కంటే ఎక్కువగా ఉంది. నా ఇంటికి కరెంట్ బిల్లు అంతగా ఎలా వచ్చింది అంటూ ఆమె సోషల్ మీడియాలో అదానీ గ్రూప్ ను ప్రశ్నించింది. మినిమం పవర్ వాడకుండానే అంత బిల్లు ఎలా వచ్చిందో మీరే చెప్పాలంటూ ఎలక్ట్రిసిటీ అధికారిక ఖాతాను ట్యాగ్ చేస్తూ నిలదీసింది. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో కూడా ఈ అమ్మడు జత కట్టింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ అంటూ అల్లరి నరేష్ సినిమాలో కూడా నటించింది. అయితే ఇటీవలి కాలంలో పెద్దగా సినిమాలతో అలరించని ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది.
So what kind of scam is @Adani_Elec_Mum conducting in mumbai? June electricity bill close to 1lakh… (based on their “estimates” since they could not do meter reading during lockdown) hearing lots of similar complaints from Mumbaikars.
@AdaniOnline @CMOMaharashtra— Karthika Nair (@KarthikaNair9) June 25, 2020
ఎన్నికల్లో జనసేన ఓటమి… స్పందించిన చరణ్