telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మణిరత్నం “నవరస”కు మీటూ సెగ

Manirathnam

ప్రముఖ సింగర్ చిన్మయి మీటూ ఉద్యమం జరిగిన సమయంలో కోలీవుడ్ ప్రముఖ రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికీ ఆమె వీలున్న ప్రతిసారి వైరముత్తుని చిన్మయి టార్గెట్ చేస్తూనే ఉంది. కాగా తాజాగా మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్‌గా ‘నవరస’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తొమ్మిది కథలు, తొమ్మిది మంది దర్శకులతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. మణిరత్నంతో పాటు జయేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్‌సుబ్బరాజ్‌, గౌతమ్‌ మీనన్‌, కేవీ ఆనంద్‌, అరవిందస్వామి, ‌రతీంద్రన్‌ ప్రసాద్‌, బిజోయ్‌ నంబియార్‌, పొన్‌రామ్‌, హలిత షలీమ్, కార్తీక్‌ నరేన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఎవరూ ఎలాంటి రెమ్యునరేషన్స్‌ తీసుకోకుండా ఈ ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తుండటం విశేషం. అయితే ఈ సినిమాకు సింగర్‌ కార్తీక్‌ పని చేస్తున్నారు. దీంతో మీటూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న కార్తీక్‌ను ఈ సినిమాలో పని చేయించడంపై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్స్‌ ట్వీట్స్‌కు చిన్మయి స్పందిస్తూ వేధింపులకు గురి చేసిన వ్యక్తికి అండగా నిలబడటం, అతనికి పని కల్పించడం బాధాకరమని చిన్మయి అన్నారు.

Related posts