దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై హలో బ్రదర్, సంతోషం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాఖీ, దొంగాట లాంటి హిట్ చిత్రాలను నిర్మించారు. త్వరలో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై ఐటీ రైడ్స్ జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణా జిల్లాలోని పెదగొన్నూరులోని ఆయన స్వగృహంలో ఈ సోదాలు జరిగాయి. ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎం. శ్వేత ఆధ్వర్యంలో గురువారం ఈ సోదాలు జరిగాయి. అయితే సోదాలు ఇంకా పూర్తి కాలేదని మరో రెండు బీరువాలు తెరవాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కేఎల్ నారాయణ హైదరాబాద్లో ఉన్నారు. ఆయన శుక్రవారం గ్రామానికి చేరుకుంటారు. ఆ తరువాత రెండు బీరువాలను కూడా సోదా చేసిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అయితే నారాయణ ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలోనే హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఇతర వ్యాపార కార్యాలయాలు, ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్టుగా తెలుస్తోంది.
previous post
బాలయ్య వ్యాఖ్యలతో చిరు షాకింగ్ డెసిషన్…?