telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జగన్‌ తో జీవితా రాజశేఖర్‌ భేటీ

Jeevitha Rajasekhar meets ys jagan
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్ తో  సోమవారం ప్రముఖ నటుడు జీవితా రాజశేఖర్‌  భేటీ అయ్యారు. అనంతరం రాజశేఖర్‌ మాట్లాడుతూ…చాలా రోజుల తర్వాత వైఎస్‌ జగన్‌ను కలిశానని అన్నారు. మా మధ్య ఉన్న కొన్ని మనస్పర్థలు ఈ రోజుతో తొలగిపోయాయని తెలిపారు.  మనస్పర్థలు తొలగించుకోవడానికే ఆయన దగ్గరకు వచ్చానని చెప్పారు. 
అప్పటి జగన్‌ వేరు ఇప్పటి జగన్‌ వేరని రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు.  యువకుడైన వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. జగన్  ముఖ్యమంత్రి అయ్యేందుకు మా వంతు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. జీవిత మాట్లాడుతు..ఎన్నికల ముందు ఇచ్చే డబ్బులు, చీరలకు ఆశపడద్దని ఓ‍టర్లకు సూచించారు. రాష్ట్ర భవిష్యత్‌ బాగుండాలంటే అది వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. 

Related posts