telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మహారాష్ట్ర : .. భారీవర్షాలతో ప్రమాదాలు .. 18 మృతి..

18 died in maharastra on rains

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోడలు కూలి 18 మంది మృతి చెందారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబైలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాదలో రాత్రి గోడకూలి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది గాయపడ్డారు. పూణెలో జరిగిన మరో ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అంబేగావ్‌లోని సింగాడ్ కళాశాల గోడకూలి ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. మలాడ్ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని ట్వీట్ చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Related posts