జగిత్యాల జిల్లా మెట్పల్లి మండంలోని ఓ తండాలో ‘కేసీఆర్ తండా’ అని పేరు పెట్టుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. గత ఏడాది ఆగస్టు 2వ తేదీన కేసీఆర్ ప్రభుత్వం తండాలకు పంచాయతీలుగా గుర్తింపు ఇస్తూ ప్రకటన జారీ చేసింది. అప్పట్లో తండా వాసులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై గిరిజన తండా వాసులు ప్రత్యేక అభిమానాన్ని చాటుతున్నారు.
తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యను హర్షిస్తూ ఓ పంచాయతీ వాసులు తమ తండాకు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టడం విశేషం. ఎన్నో ఏళ్లుగా ‘మా తండాలో మా రాజ్యం’ కోసం నినదిస్తున్న గిరిజనులు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అప్పట్లోనే చాలా సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా ఓ తండాకు ఆయన పేరు పెట్టుకుని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
పీపీఏలపై హైకోర్టు తీర్పు జగన్ సర్కారు కు చెంప పెట్టు: కళా వెంకట్రావ్