వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్న ఆయనను పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. ఆయన్ను ప్రశ్నించేందుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కోర్టు అనుమతి కోరగా న్యాయమూర్తి 7 గంటల పాటు ప్రశ్నించేందుకు అనుమతించారు.
దీంతో ఆయన్ను జైలు నుంచి పోలీసు అధికారులు తీసుకుని వెళ్లారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఓర్వకల్లు పీఎస్ లో కూడా ఓ కేసు నమోదై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పోలీసులు కస్టడీ కోరగా, కోర్టు అనుమతించింది. నేటి సాయంత్రం కస్టడీ సమయం ముగిసిన తరువాత తిరిగి ఆయనను కడప సెంట్రల్ జైల్ కు తరలించనున్నారు.
సీమ ప్రజలకు తాగునీరు ఇవ్వండి.. సీఎం జగన్ కు లోకేశ్ సూచన!