సినీనటి జయప్రద బీజేపీలో చీరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీ సుమారు 300 చిత్రాల్లో నటించి ఒక వెలుగు వెలిగిన జయప్రద అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గతంలో టీడీపీలో ఆ తర్వాత సమాజ్ వాద్ పార్టీలో ఆమె మొన్నటివరకు కొనసాగారు. ఇప్పుడు ఆ పార్టీకి ఆమె రాజీనామా చేశారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె కషాయ కండువా కప్పుకోవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ నియోజకవర్గం నుంచి బీజీపీ తరపున ఆమె పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ పూర్ నుంచి సమాజ్ వాద్ పార్టీ నుంచి అజమ్ ఖాన్ పోటీకి దిగుతున్నారు. దీంతో ప్రత్యర్థి అజమ్ ఖాన్ పై జయప్రద పోటీకి దిగి విజయం సాధించాలని ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.