పోటీ చేసిన రెండు చోట్లా ఓడినా రాజకీయ పోరాటాన్ని ఆపలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఢిల్లీలోనిర్వహించిన ‘ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్’ సమావేశంలో పవన్ ప్రసంగించారు. దేశానికి సేవ చేయాలన్న తపనతోనే రాజకీయ పార్టీని స్థాపించానని, ప్రజలకు సేవ చేసేందుకే పోరాటాలు కొనసాగిస్తున్నానని చెప్పారు. భగత్ సింగ్ లాంటి వారు తనకు ఆదర్శమన్నారు. లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉన్నానని తెలిపారుయువతలో ఆవేశాన్ని అర్థం చేసుకుని వారితో మాట్లాడానని చెప్పారు.
తాను చిన్నప్పటి నుంచీ జాతీయ, ప్రాంతీయ రాజకీయాలను చూస్తూ పెరిగానని.. అధికారం కోసం కొందరు చేస్తున్న రాజకీయాలను చూసి విసుగు చెందానని చెప్పారు. రాజకీయంగా తనకు ఒకే ఎమ్మెల్యే ఉన్నా, తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నానని తెలిపారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే కొన్నేళ్ల పోరాటంతోనే సాధ్యమవుతుందన్నారు.