telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సామాజిక

మా ఇంట్లోనే .. మహిళా సాధికారత .. : చంద్రబాబు

apcm in womens day celebrations

గుంటూరులో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారత అంటే ఏంటో తమ ఇంట్లో తాను చేసి చూపించానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 27 ఏళ్ల క్రితం డైరీ పరిశ్రమను ప్రారంభించామన్నారు. తన భార్య భువనేశ్వరి కృషితో విజయవంతంగా పరిశ్రమను నడుపుతున్నామన్నారు. దీపం పథకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని, మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవం కాపాడామన్నారు. మహిళలు తయారుచేసిన వస్తువులకు మార్కెటింగ్‌ కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 8 శాతం ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు కొనియాడారు.

టీడీపీ ప్రభుత్వం మహిళలు, పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. అంగన్‌వాడీల్లో పనిచేసేవారికి ప్రతి నెలా రూ.10,500 జీతం ఇస్తున్నామన్నారు. అన్నా అమృత హస్తం ద్వారా గర్భిణులకు ఒకపూట భోజనం పెడుతున్నామని, సామూహిక శ్రీమంతాలకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే కోటి మంది డ్వాక్రా మహిళలకు మొబైల్‌ ఫోన్లు ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు.

Related posts