telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

నేడు హైదరాబాద్ కు జగన్.. సాయంత్రం కేసీఆర్‌తో భేటీ

everything is ready for 30th jagan oath

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శనివారం హైదరాబాద్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం  గంటలకు జగన్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో జగన్‌ భేటీకానున్నారు. వైఎస్‌ఆర్‌ఎల్పీ తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. 

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి కేసీఆర్‌ను వైఎస్‌ జగన్‌ ఆహ్వానించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్‌ను మోదీ ఇప్పటికే అభినందించారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు జగన్‌తో పాటు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీ వెళ్తారు. మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీతో జగన్‌ భేటీకానున్నారు. ఈ నెల 30న విజయవాడలో సీఎంగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని జగన్ మోదీని ఆహ్వానించనున్నారు.

Related posts