వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే… వైఎస్ షర్మిల నిరుద్యోగ-నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు…అనంతరం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత షర్మిలను మేడిపల్లి పీఎస్కు తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ నేపథ్యం లో తీవ్ర ఉద్రికత్తత నెలకొంది. వైఎస్ఆర్టీపీ శ్రేణులు మరియు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
చివరికి వైఎస్ఆర్టీపీ కార్యకర్తలను క్లియర్ చేసి వైఎస్ షర్మిల ను మేడిపల్లి పీఎస్ కు తరలించారు పోలీసులు. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య మైన ప్రాంతాల్లో నిరుద్యోగ దీక్ష చేశారు వైఎస్ షర్మిల. ఇందులో భాగంగానే ఈ రోజు బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యం లోనే వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు పోలీసులు.
మంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారు.. నాయిని సంచలన వ్యాఖ్యలు