telugu navyamedia
రాజకీయ

మీ సైనికులు కశ్మీర్‌ లో ఉన్నంత కాలం మీరు ఏడవాల్సిందే!

Hizbul Mujahideen
పుల్వామా ఉగ్రదాడిలో 43 మంది జవాన్ల మరణాన్ని  మరువక ముందే ఆత్మాహుతి దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కశ్మీరీ వేర్పాటువాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ హెచ్చరించింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కశ్మీరీ యువకులు ఆత్మబలిదానాలకు వెనుకడుగు వేయరని పేర్కొంది. పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం.. కశ్మీర్‌లో తిరిగే ప్రతీ ఉగ్రవాదిని అంతం చేస్తామని ఆర్మీ అధికారులు మీడియా ముఖంగా హెచ్చరించారు. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న కశ్మీరీ యువత లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ విషయంపై స్పందించిన హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఆపరేషనల్‌ కమాండర్‌ రియాజ్‌ నైకూ సుమారు 17 నిమిషాల నిడివి గల ఆడియో మెసేజ్‌ను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు.  మీ సైనికులు కశ్మీర్‌ లో ఉన్నంత కాలం మీరు ఏడవాల్సిందే. మీ జవాన్ల శవపేటికలు వస్తూనే ఉంటాయి. చావడానికైనా మేము సిద్ధమే. కానీ వాళ్లను మాత్రం బతకనివ్వం. ఆత్మబలిదానాలకు సిద్ధంగా ఉన్నాం. మా దళంలోని 15 ఏళ్ల పిల్లలు వాళ్ళ  శరీరాలకు బాంబులు కట్టుకుని.. భారత ఆర్మీ వాహనాలపై దాడి చేసే రోజు ఎంతో దూరంలో లేదు.  మొన్న దాడి చేసింది కూడా ఓ కశ్మీరీ యువకుడే. సైన్యం కారణంగానే అతడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు మరికొంత మంది సిద్ధంగా ఉన్నారు. ప్రపంచంలోని ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు’ అంటూ రియాజ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Related posts