ఏపీ సర్కార్ తీరుపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుప్దడ్డారు. టీడీపీ మాజీ ఎంపీ సబ్బం హరికి చెందిన సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీ కూల్చివేతపై ఘాటుగా స్పందించారు. ఈ కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులు తప్ప సమర్థులు కాదని చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెలుగుదేశం నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రి వేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం?’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు. ఈ ఘటన కు సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కేసీఆర్ ఇలాకలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ: కేటీఆర్