telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై సోమిరెడ్డి ఫైర్

somireddy chandramohan

నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కూల్చివేత ప్రాంతాన్ని సోమిరెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  చాలా ఏళ్ల కిందట స్థానికులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న ఈ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ విగ్రహ కూల్చివేతపై సీఎం వైఎస్ జగన్ స్పందించాలన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని చెప్పారు. విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలన్నారు.  కొవిడ్ కారణంగానే ఎన్టీఆర్ అభిమానులు మౌనంగా ఉన్నారని తెలిపారు. విగ్రహాన్ని యథాతథంగా ప్రతిష్టించకపోతే జరగబోయే పరిణామాలకు మేం బాధ్యులం కాదని సోమిరెడ్డి హెచ్చరించారు.

Related posts