సిద్దిపేట మున్సిపల్ పారిశుద్య కార్మికుల తీరుపై తెలంగాణ మంత్రి హరీష్రావు అసహనం వ్యక్తం చేశారు. మాస్కులు, గ్లౌజులు లేకుండా విధులు ఏలా నిర్వర్తిస్తున్నారని మున్సిపల్ కమిషనర్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రాజీవ్ రహదారి సమీపం పొన్నాల నుంచి పట్టణానికి వచ్చే దారిలో తన కాన్వాయ్ని ఆపి ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు లేకుండా రోడ్లు శుభ్రం చేస్తున్న పారిశుద్య కార్మికులను పలకరించారు
.కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, కార్మికుల తీరుపై మంత్రి మండిపడ్డారు. ఈ మేరకు పారిశుద్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు ఉన్న కిట్లను అందజేసి కరోనా వ్యాధి నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.