లాక్ డౌన్ ఆలవుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ రూ.1500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగూణంగా ఈ రోజు పేదల ఖాతాల్లో రూ.1500 చొప్పున జమ కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,112 కోట్లు బ్యాంకులకు బదిలీ చేసిందని మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు.ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించి ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
ఇంటి నుంచి బయటకు వస్తే వైరస్ బారిన పడతారని పేర్కొన్నారు. ఇంటిలోని ఉండి బౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం 87శాతం అంటే సుమారు 76 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు పంపిణీ చేసినట్టు తెలిపారు.