telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ద.. పంచాయితీలకు రూ. 307 కోట్లు: ఎర్రబెల్లి

Minister Erraballi comments Congress

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. డబ్బుల ఇబ్బందుల్లో ఉన్న గ్రామ పంచాయితీలకు 307కోట్ల రూపాయలను విడుదల చేసిన కేసీఆర్‌ ఔదార్యానికి మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నెలకు సంబంధించి గ్రామ పంచాయితీలకు నిధులకు విడుదల చేసిన సందర్భంగా ఆయన స్పందించారు.

సీఎం ఆదేశాల మేరకు ఈ నిధుల్లో నయాపై స వృధా జరగొద్దని గ్రామ సర్పంచ్‌లు, అధికారులను మంత్రి ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ప్రేరణగా పారిశుద్ద్యం, కరోనా నిర్మూలనే లక్ష్యాలుగా ఆ నిధులను ఖర్చు చేయాలని అన్నారు. ప్రతి రోజూ పారిశుద్ద్యం పనులు నిర్వహించాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలోనూ పారిశుద్ద్య లోపం ఏ గ్రామంలోనూ కనిపించ వద్దన్నారు.

Related posts