telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

Road accident 8 dead and 30 injured

అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు టోల్‌ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌ కర్నూలు నుంచి అనంతపురం వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా.. అనంతపురం నుంచి కర్నూలు ఆస్పత్రికి రోగిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts