హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై నిన్న అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను చూపాలని శాసనసభలో కాంగ్రెస్పక్ష నేత మల్లుభట్టి విక్రమార్క సవాలు విసిరారు. భట్టి సవాలును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు.
ఈ నేపథ్యంలో నగరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈ రోజు మంత్రి తలసాని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు చూపించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కొత్తవాళ్లకు ఇచ్చింది తక్కువేనన్నారు.
కొత్తగా 400 మందికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ రోజు 3,428 ఇళ్లను పరిశీలించామని తెలిపారు. రేపు కూడా ఇళ్లను పరిశీలించాలనుకుంటున్నామని చెప్పారు. ఇళ్ల నాణ్యతను క్వాలిటీ విభాగం పరిశీలిస్తోందనిఆయన తెలిపారు.