హైదరాబాద్ శివార్లలో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ భగవంతుడ్ని పూజించే ఆచారం తనకు తల్లిదండ్రుల నుంచే సంక్రమించిందని తెలిపారు. తనది బాల్య వివాహం అని, పద్నాలుగో ఏటనే వరంగల్ జిల్లా చిత్తలూరులో పెళ్లయిందని కేసీఆర్ వెల్లడించారు. అప్పటినుంచే తనలో భక్తి పెంపొందిందని కేసీఆర్ పేర్కొన్నారు.
తమ పెళ్లి ఓ ఆధ్యాత్మిక గురువు సమక్షంలోనే జరిగిందని తెలిపారు. అప్పట్లో ఆధ్యాత్మిక గురువులు తమ ఇంటికి వచ్చేవారిని, వారు నెల రోజుల పాటు తమ ఇంట ఉండి పురాణాలు, ఇతిహాసాలు వివరించేవారని గుర్తుచేసుకున్నారు. తామంతా జై శ్రీమన్నారాయణ నామస్మరణతో వైష్ణవ సంప్రదాయం అనుసరిస్తామని వివరించారు.