భారత్-చైనా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ అంశంపై రాజ్యసభలో ఆయన ఓ ప్రకటన చేశారు. ఒప్పందాలను చైనా బహిరంగంగానే ఉల్లంఘిస్తుందని తెలిపారు.
చైనా మాటలు ఒకలా, చేతలు మరోలా ఉన్నాయని చెప్పారు. చైనాతో ఎలాంటి పరిస్థితులున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చైనా చర్యలకు భారత సాయుధ బలగాలు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చాయని వెల్లడించారు.
1988 తర్వాత భారత్, చైనాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయని రాజ్నాథ్ గుర్తు చేశారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. 1962లో చైనా 38వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని తెలిపారు.