telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండుగ వాతావరణం: బీజేపీ ఎంపీ అరవింద్

aravind bjp mp

జమ్మూకశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తున్నట్లు సోమవారం రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్‌షా పకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరవింద్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు.

దేశ వ్యాప్తంగా యువత సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు నేడు శాంతి చేకూరిందని చెప్పారు. 370 ఆర్టికల్‌ రద్దుతో జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి వేగవంతం అవుతుందని, అనేక కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ లో జమ్ముకశ్మీర్ అంతర్భాగం కాదని చెప్పిన టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో చెంప చెళ్లుమందని మండిపడ్డారు.

Related posts