telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఎంతో బాధ కలిగిస్తోంది: విజయశాంతి

vijayashanthi

విశాఖ శివారు ప్రాంతం ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకై 9 మంది మరణించారు. ఈ విషాద ఘటనపై సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విజయశాంతి స్పందించారు. ఓవైపు కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ విశాఖపట్టణం, పరిసర గ్రామాల ప్రజలు విషవాయువు బారినపడడం ఎంతో బాధ కలిగిస్తోందని ట్వీట్ చేశారు.

విషవాయు లీకైనా ఘటనలో మూగజీవాలు మరణించడం తీరని వేదన మిగిల్చాయని పేర్కొన్నారు. ఇప్పటికే మొక్కవోని ధైర్యంతో కరోనాపై పోరాడుతున్న విశాఖ పౌరులు, పరిసర గ్రామ ప్రజలు, ఈ దుర్ఘటన నుంచి కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు విజయశాంతి తెలిపారు. బాధిత కుటుంబాల వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేవారు.

Related posts