telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కోలుకున్న వారికి మళ్లీ కరోనా పరీక్షలు..చైనా సంచలన నిర్ణయం!

e-visa cancelled by indian embassy in china

చైనాలో కరోనా భారీన పడి కోలుకున్న ప్రతి ఒక్కరికీ మరోసారి పరీక్షలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో సెకండ్ వేవ్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా 76 రోజుల పాటు లాక్ డౌన్ లో ఉండిపోయిన వూహాన్ లో నిబంధనలను సడలించిన మరుసటి రోజు చైనా తన నిర్ణయాన్ని ప్రకటించింది.

గురువారం కొత్తగా 63 కరోనా పాజిటివ్ కేసులు రాగా, అందులో 61 మంది వివిధ దేశాల నుంచి వచ్చిన వారేనని చైనా నేషనల్ హెల్త్ మిషన్ ప్రకటించింది. దీంతో చైనాలో సెకండ్ వేవ్ లో భాగంగా 1,104 కేసులు నమోదైనట్లయింది. మరో ఇద్దరు మృత్యువాత పడటంతో కరోనా మృతుల సంఖ్య 3,335కు చేరగా, మొత్తం కేసుల సంఖ్య 81,865కు చేరుకుంది.

మూడు నెలల అవిశ్రాంత పోరాటం అనంతరం చైనాలో పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. శరవేగంగా తమ దేశంలో కరోనాను చైనా అదుపులోకి తెచ్చింది. ఫ్యాక్టరీలు, వ్యాపారాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విమానాల నిలిపివేతతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారు, తిరిగి స్వదేశానికి చేరుతూ ఉండటంతో కేసుల సంఖ్య పెరుగుతోంది.

దీంతో కరోనా వైరస్ సోకి, ఆపై నెగటివ్ వచ్చిన వారందరి కోసంచైనా ప్రభుత్వం కొత్త ట్రయల్ ప్రొటోకాల్ ను విడుదల చేసింది. వీరందరినీ డాక్టర్లు పరీక్షిస్తారని, వారి నుంచి నమూనాలను స్వీకరించి, మరోసారి పరీక్షలకు పంపుతారని స్పష్టం చేసింది. కరోనా పుట్టినిల్లుగా పేరు తెచ్చుకున్న వూహాన్ లో కరోనా నుంచి 77,370 మంది బయటపడగా, వారందరికీ ఇప్పుడు తిరిగి రక్త పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు సిద్దమవుతున్నారు.

Related posts