telugu navyamedia
రాజకీయ వార్తలు

అంత ప్రమాదకరంగా కరోనా వైరస్‌ లేదు: మమతా బెనర్జీ

mamatha benerji

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అని బుధవారం జరిగిన ఓ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ ఢిల్లీ హింసపై ప్రజల దృష్టిని మరల్చేందుకే దేశంలోకి కరోనా వచ్చిందని ప్రజల్లో భయం సృష్టిస్తోందని ఆరోపించారు. ఈ రోజు కొంత మంది కరోనా అంటూ పెద్దగా అరుస్తున్నారు. కానీ ప్రభుత్వం చెబుతున్నంత ప్రమాదంగా కరోనా లేదని అన్నారు.

అది భయంకరమైన వ్యాధి అయినప్పటికీ, ప్రజల్లో ఇంతగా భయం పుట్టించాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని న్యూస్‌ చానళ్లు ఢిల్లీలో జరిగిన ఘటనను అణగదొక్కేందుకు వైరస్‌పై అతిగా ప్రచారం చేస్తున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తి చెందాలని మనం అనుకోకూడదు. కానీ, ఢిల్లీ అల్లర్లలో మృతి చెందిన వాళ్లు ఈ వైరస్‌ కారణంగానే చనిపోలేదని మనం గుర్తుంచుకోవాలని మమత పేర్కొన్నారు.

Related posts