ఢిల్లీలోని ఎయిమ్స్లో వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఆసుపత్రిలో ఇప్పటివరకు 480 మంది కరోనా పాటివ్లుగా తేలారు. ఇందులో 19 మంది డాక్టర్లు ఉండగా, 38 నర్సులు, 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 74 మంది భద్రతా సిబ్బంది, 75 మంది అటెండెంట్లు, 54 మంది శానిటేషన్ సిబ్బంది ఉంన్నారు. 19 డాక్టర్లలో ఇద్దరు ప్రొఫెసర్లు ఉంగా, మిగిలినవారు రెసిడెంట్ డాక్టర్లున్నారు.
కరోనాతో ఈ దవాఖానలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. ఇందులో ముగ్గురు వైద్య సిబ్బంది ఉండగా, మరొకరు హాస్పిటల్ శానిటేషన్ సిబ్బందికి ఇన్చార్చి ఉన్నారు. హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇలా కరోనా బారినపడుతున్న వైద్యసిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో డాక్టర్లు, నర్సులతోపాటు వైరద్యసిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.