telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో నడ్డా మాటలు కార్యరూపం దాల్చలేదు: పొన్నం ప్రభాకర్

ponnam prabhakar fire on ktr

తెలంగాణలో బీజేపీ నేత నడ్డా మాటలు కార్యరూపం దాల్చలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై జేపీ నడ్డా చాలాసార్లు మాట్లాడి వెళ్లారని కానీ ప్రయోజనం లేదని తెలిపారు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి టిఆర్ఎస్ అవినీతిపై ఎంక్వయిరీ జరిపించాలన్నారు. లేకపోతే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య స్నేహం ఉందని ఒప్పుకోండని పొన్నం వ్యాఖ్యానించారు.

బీజేపీకీ అవసరం ఉన్నప్పుడల్లా టీఆర్ఎస్ సహాయం తీసుకుంటున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వయిరీకి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయండన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని పొన్నం ప్రశ్నించారు.

Related posts