telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు గడువు పెంపు

exam hall

తెలంణలోని 35 గురుకుల జూనియర్‌ కాళాశాలల్లో ప్రవేశం కోసం టీఎస్‌ఆర్‌జెసి-సెట్‌-2020 కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును సెప్టెంబరు 5వ తే దీ వరకూ పొడిగించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 20వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో గడువును సెప్టెంబరు 5వ తేదీ వరకూ పొడిగించినట్టు ఒక ప్రకటన లో పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఎంపిసి, బిపిసి, ఎంఈసి కోర్సులకు సంబంధించి తెలంగణలోని 35 గురుకుల జూనియర్‌ కాళాశాలల్లో ప్రవేశం కోసం టీఎస్‌ఆర్‌జెసి-సెట్‌-2020 కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారన్నవిషయాన్ని తర్వాత ప్రకటించనున్నట్టు తెలిపారు.

Related posts