telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రాంతీయ పార్టీలపై బీజేపీ తీరు దారుణం: యామిని

TDP Yamini fire to Ys Jagan

టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో యామిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమిత్ షాపై నిప్పులు చెరిగారు.

నాడు గుజరాత్ లో అమిత్ షా మంత్రిగా వున్న సమయంలో ఎన్నో అల్లర్లు జరిగాయని గుర్తు చేశారు. అమిత్ షా సాధుపుంగవుడని బీజేపీ భావిస్తుండటం చాలా దారుణమని విమర్శించారు. రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలపై బీజేపీ అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఉండే స్ఫూర్తిని మోదీ దెబ్బతీశారని అన్నారు.

Related posts