telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ తీరుతో రాష్ట్రం అభాసుపాలు: ఉత్తమ్

uttam congress mp

తెలంగాణ సీఎం కేసీఆర్ పై పీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తీరుతో రాష్ట్రం అభాసుపాలవుతుందని ఉత్తమ్ పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతున్నాయని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ గారి వ్యాఖ్యలు, కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతున్నాయి. చిన్న రాష్ట్రాలు కూడా రోజుకు లక్షల్లో టెస్టులు చేస్తుంటే తెలంగాణలో నిన్న చేసిన టెస్టులు కేవలం 19,579 మాత్రమే అని ఉత్తమ్ దుయ్యబట్టారు.

Related posts