telugu navyamedia
క్రీడలు వార్తలు

నేను చాలా లక్కీ అంటున్న రాయల్స్ ఆటగాడు…

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరఫున అరంగేట్రం చేసిన ఈ యువ పేసర్ అద్భుత ప్రదర్శనతో అందర్ని ఆకట్టుకున్నాడు. తనదైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. కోటి 20 లక్షలకు అతన్ని కొనుగోలు చేసింది. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థాంతరంగా వాయిదా పడగా.. తనకు రావాల్సిన డబ్బు వచ్చేసిందని ఈ యువ పేసర్ చెప్పుకొచ్చాడు. ‘నేను చాలా లక్కీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున నాకు రావాల్సిన డబ్బు కొద్ది రోజుల క్రితమే అందింది. నేను వెంటనే ఆ డబ్బును ఇంటికి పంపించాను. ఈ కఠిన సమయంలో అది నా కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడింది. ‘అని పేర్కొన్నాడు. క్రికెట్ ఒక్కటే తనకు ఆదాయ మార్గామని ఈ యువ పేసర్ చెప్పుకొచ్చాడు. ఆ డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషించడంతో పాటు తన తండ్రికి మెరుగైన చికిత్స అందించగలనని తెలిపాడు. ఐపీఎల్ 2021 సీజన్‌ తన జీవితాన్ని మార్చేసిందని, ఈ టోర్నీ జరగకపోయుంటే తన పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన చేతన్ సకారియా.. ఏడు వికెట్లు తీశాడు.

Related posts