ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వైసీపీ తరపున ప్రచారం చేస్తున్న సినీ నటులపై మండిపడ్డారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో మంగళవారం నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ హుదూద్ లాంటి విపత్తులు వచ్చిన సమయంలో సినీ నటులు ఏపీకి ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. మోహన్ బాబు, జయసుధ, అలీ ఎక్కడి నుండి వస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ అందరినీ బెదిరించి పంపిస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. హైద్రాబాద్లో ఇంతకాలం ఉంటూ కేసీఆర్కు ఊడిగం చేసుకోవాలని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు కష్టకాలంలో ఉన్న సమయంలో సినీ నటులు ఎందుకు రాలేదో చెప్పాలని బాబు ప్రశ్నించారు.తిరుమలను కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని కుట్రపన్నారని చంద్రబాబు ఆరోపించారు.
తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకొన్న వారేవరూ బాగుపడలేదన్నారు. రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది అంటూ బాబు దుయ్యబట్టారు. ఓట్ల దొంగలను మోడీ కాపాడారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ఈరోజు లోటస్పాండ్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేస్తున్నారు: రోజా