telugu navyamedia
రాజకీయ వార్తలు

జైట్లీ మరణం దేశానికి తీరని లోటు : వెంకయ్య

venkaiah naidu

అరుణ్ జైట్లీ మరణం దేశానికి తీరని లోటు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ మరణవార్తతో చెన్నైలో ఉన్న వెంకయ్య… తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. వెంటనే ఢిల్లీకి బయల్దేరారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని అన్నారు.

తనకున్న అత్యంత సన్నిహితుల్లో జైట్లీ ఒకరని చెప్పారు. ఆయన ఒక న్యాయకోవిదుడని, ఉత్తమ పార్లమెంటేరియన్ అని కొనియాడారు. పన్ను విధానంలో సమూల మార్పులకు ఆయన కృషి చేశారని, జీఎస్టీని తీసుకురాడంలో ప్రముఖ పాత్రను పోషించారని తెలిపారు.

Related posts