telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నేడు స్వగ్రామానికి వీర జవాన్ రాడ్య మహేష్ పార్థివ దేహం…

ఈ మధ్యే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన నేడు వీర జవాన్ రాడ్య మహేష్ పార్థివ దేహం స్వగ్రామానికి రానుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు కి బేగంపేట ఎయిర్పోర్ట్ లో పార్థివ దేహాన్ని రీసివ్ చేసుకోనున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం మహేష్ స్వగ్రామం లో అంత్య క్రియలు జరగనున్నాయి. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. సైనిక లాంఛనాలతో వీర జవాన్ మహేష్ అంత్య క్రియలు జరగనున్నాయి. అయితే జవాన్ మహేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా రూ. 50లక్షల ఆర్థిక సాహాయం అందిస్తుందని వెల్లడించారు. అలాగే అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయస్తామని కేసీఆర్ ప్రకటించారు.

Related posts