telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్థానిక ఎన్నికల్లో జగన్‌ కు ఓటమి భయం: కేశినేని శ్వేత

swetha kesineni

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే మీ కేంద్ర మిత్రుల సహకారంతో ఆదేశాలు జారీ చేయించుకున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ స్వరం మార్చి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పనిచేసే ముఖ్య అధికారిని విమర్శించడం సరికాదు’ అని జగన్‌ను విమర్శించారు.

‘ఇది రాష్ట్రమా? కులకార్చిచ్చుతో రగులుతున్న రణరంగమా?’ అని ఆమె ప్రశ్నించారు. కాగా, ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టీడీపీ ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత.. స్థానిక ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ 11వ డివిజన్‌ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆమెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

Related posts