వేలాది మంది నిరుద్యోగ యువకులు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం విద్యాసంస్థల్లో శిక్షణ పొందుతుంటారు. అంతేగాకుండా ఫిజికల్ కోచింగ్ తీసుకొని అన్నివిధాల ఉద్యోగం కోసం కృషి చేస్తునారు. ఆర్మీలో ప్రవేశ అర్హతల పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఆండ్ నాలెడ్జ్ (టాస్క్) కీలక ముందడుగు వేసింది. వారికి టాస్క్ సీఈవో శ్రీకాంత్సిన్హా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సైన్యంలో ఉద్యోగావకాశం పొందేలా శిక్షణ ఇస్తున్నామని టాస్క్ సీఈవో తెలిపారు.
ఈ శిక్షణను వరంగల్, రామగుండం సెంటర్లలో వచ్చే నెలలో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. నామమాత్రపు ఫీజుతో ఇస్తున్న ఈ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, మెజార్టీ ఫీజును టాస్క్ భరిస్తున్నదన్నారు. ఈ పథకం ద్వారా గత ఏడాది 380 మంది శిక్షణ పొందినట్టు తెలిపారు. టాస్క్ శిక్షణకు సమన్వయకర్తగా ఉన్న బ్రిగేడియర్ (రిటైర్డ్) సీఎస్ శ్రీరాములు శిక్షణ గురించి వివరిస్తూ, టాటూ (పచ్చబొట్టు) కలిగి ఉంటే ఆర్మీ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటిస్తారని తెలిపారు. ఈ విషయాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు.
ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించను: సీఎం జగన్