కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ప్రపంచ మేటి బ్యాట్స్మన్లు. ఓపెనర్గా రోహిత్.. వన్ డౌన్లో కోహ్లీ పరుగుల వరద పారిస్తారు. పిచ్ ఏదైనా, బౌలర్ ఎవరైనా బాదడమే వారికి తెలుసు. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ బౌలింగ్ చేయడం కష్టమేం కాదు. నిజానికి రోహిత్కు బౌలింగ్ చేయడం తేలిక. బంతిని రెండువైపులా స్వింగ్ చేస్తూ అతడిని ఔట్ చేయగలను. ఎడమచేతి వాటం పేసర్ విసరే ఇన్స్వింగర్లకు రోహిత్ ఇబ్బంది పడతాడు. ముందుగానే బ్యాటు నుంచి దూరంగా వెళ్లే బంతులూ ఆడలేడు. ఒత్తిడిలో రాణిస్తాడు కాబట్టి కోహ్లీని ఔట్ చేయడం కాస్త కష్టమని చెప్పొచ్చు. అయితే విరాట్, రోహిత్కు బౌలింగ్ చేయడం నాకైతే కఠినంగా అనిపించదు’ అని అన్నాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన మహ్మద్ అమీర్.. అంతర్జాతీయ క్రికెట్కి గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించి మహ్మద్ అమీర్ ప్రస్తుతం తన భార్య, పిల్లలతో కలిసి లండన్లో ఉంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్ క్రికెట్ టోర్నీలు ఆడాలని అతడు భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే భారత్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు బ్రిటీష్ సిటిజన్షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు.
previous post
next post
కేసీఆర్ మొహం చాటేశాడు.. బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు