కన్నడ చిత్ర పరిశ్రమలో ఐటీ శాఖ గురువారం భారీ ఎత్తున దాడులు నిర్వహించింది. స్టార్ హీరోలు యశ్, పునీత్ రాజ్కుమార్, కిచ్చా సుదీప్, శివరాజ్కుమార్ నివాసాలపై దాడులు చేశారు. అదేరీతిన నిర్మాతలు రాక్లైన్ వెంకటేష్, కిరగందూరు విజయ్, నిర్మాత, ఎమ్మెల్సీ సి.ఆర్.మనోహర్, జయణ్ణల నివాసాలపై దాడులు జరిగాయి.
ఇటీవల కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందాయి. అందులో కొన్ని సక్సెస్ సాధించి బడా నిర్మాతలకు, హీరోలకు కోట్ల రాబడి తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేత ఆరోపణలు పెరగడంతో ఐటీ శాఖ సోదాలు ప్రారం భించింది. కర్ణాటకలోని సుమారు 23 ప్రాంతా ల్లో 200 మంది ఐటీ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. ప్రముఖులు నటించిన, నిర్మించిన సినిమాలు, వాటి బడ్జెట్, కలెక్షన్స్ వివరాలను అధికారులు సేకరించారు. సోదాల్లో ఐటీ అధికారులు నగదు, కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.