ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగింది. గడచిన ఆరు గంటల్లో 64.75 శాతం పోలింగ్ నమోదు అయింది. విజయనగరం అత్యధిక నమోదు కాగా.. శ్రీకాకుళంలో అత్యల్ప పోలింగ్ నమోదు అయింది.
జిల్లాల వారీ పోలింగ్ వివరాలు..
శ్రీకాకుళం 51.30 శాతం.
విజయనగరం 71.50 శాతం.
విశాఖ 64.28 శాతం.
తూ.గో 60.90 శాతం.
ప.గో 63.54 శాతం.
కృష్ణా 66.64 శాతం.
గుంటూరు 67.08 శాతం.
ప్రకాశం 65.15 శాతం.
నెల్లూరు 59.92 శాతం.
కర్నూలు 69.61 శాతం.
కడప 64.28 శాతం.
అనంత 70.32 శాతం.
చిత్తూరు 67.20 శాతం.