telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టిడిపికి షాక్ : సంగం డెయిరీ విషయంలో జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం

సంగం డెయిరీ విషయంలో ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. గతంలో సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదలాయిస్తూ ఇచ్చిన జీవో 515ను ఉప సంహరించింది ప్రభుత్వం. ఇకపై ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పోరేషన్ పరిధిలోకి రానుంది సంగం డెయిరీ. సంగం డెయిరీ రోజూవారీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టరుకు అప్పగించింది ప్రభుత్వం. రోజూ వారీ కార్యకలాపాలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకునే అధికారాన్ని తెనాలి సబ్ కలెక్టరుకు కట్టబెట్టింది ప్రభుత్వం. సంగం డెయిరీలో వివిధ అక్రమాలు జరిగాయంటూ జీవోలో పేర్కొన్న ప్రభుత్వం..ఇప్పటికే సంగం డెయిరీ వ్యవహరంపై కోర్టుకెళ్లారు ధూళిపాళ్ల నరేంద్ర. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈ తరహా జీవో ఇవ్వడంపై టీడీపీ విమర్శలు చేస్తోంది.

Related posts