ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్ నాథ్ నియామకమయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ జస్టిస్ విక్రమ్నాథ్ను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. త్వరలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే కేరళ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి పీఆర్ రామచంద్ర మీనన్ ను ఛత్తీస్ గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.
పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తి ఏకే మిట్టల్ ను మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులను ఎంపిక చేసేందుకు నిర్దేశించిన వ్యవస్థే ఈ కొలీజియం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో నలుగురు సీనియర్ జడ్జీలు ఇందులో సభ్యులుగా ఉంటారు.