ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏపీ సర్కారు చేపట్టిన “గ్రామ వాలంటీర్” నియామకాల కోసం షెడ్యూలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం భారీ సంఖ్యలో యువతీయువకులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం బీటీ వాడ గ్రామంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
గ్రామ వాలంటీర్ పోస్టును తమ సామాజికవర్గానికి ఇవ్వకపోవడంతో రజకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ కులస్తుడికి కాకుండా మరొకరికి గ్రామ వాలంటీర్ పోస్టును ఇచ్చినందున రేపటి నుంచి గ్రామస్తులబట్టలు ఉతకబోమని ప్రకటించారు. ఈ మేరకు బీటీ వాడ గ్రామంలో దండోరా రజకులు వేయించారు. .