telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలి: ఏపీ గవర్నర్‌

biswabhusan harichandan governor

రేపు నిర్వహించే జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ గవర్నర్‌ హరిచందన్ ప్రజలను కోరారు. ఆదివారం ఉ.7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోందన్నారు. అందరం అప్రమత్తం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

ఎవరికి వారు తమ వరకు రాదులే అన్న భావనలో ఉండవద్దని చెప్పారు. జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా వ్యాప్తి గొలుసును అధిగ మించగలుగుతామన్నారు. జనతా కర్ఫ్యూ మన స్వయం నియంత్రణకు ఓ సంకేతమని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు.జనం కోసమే జనతా కర్ఫ్యూ అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.

Related posts